FOOD

వాతావరణ మార్పుకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చండి.

శీతాకాలంలో తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఏ వయసు వారైనా శీతాకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా శీతాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు వాటంతట అవే వస్తుంటాయి. అయితే, కొన్ని ముందస్తు చర్యలు తీసుకుని మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వారి వారి ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కాబట్టి ఏం తినాలో తెలుసుకుందాం..

* ఈ కాలంలో నారింజ, ఆపిల్, దానిమ్మ, అరటిపండ్లను ఎక్కువగా తినాలి. వీటిని ఆరగించడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు.


* అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారుచేసిన హెర్బల్ టీలు శరీరానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.


* ఈ కాలంలో మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారం తీసుకోవడం చాలామంచిది.
* బ్రౌన్‌రైస్, ఓట్స్, బార్లీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.


* వెల్లుల్లిని సూప్‌లలో, కూరల్లో విధిగా వేయాలి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
* కాకరకాయ, పసుపు, మెంతులను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి సూక్ష్మజీవుల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.


* పల్లీ నూనె, ఆముదం, నువ్వుల నూనెలకు బదులుగా తేలిగ్గా ఉండే మొక్కజొన్న నూనెను వంటల్లో చేర్చుకోవడం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది.
 

Show More
Back to top button