Telugu Opinion SpecialsTelugu Politics

టీడీపీ జోరుకు వైసీపీ బ్రేక్ వేస్తుందా?

ఏపీకి ఆర్ధిక రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజకీయ పార్టీలకు ఎంతో కీలకం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన సమయంలోనూ విశాఖ నగర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ తన హవా చూపించింది. ఇందులో విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని 2008లో ఏర్పాటు చేశారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడినే మరోసారి టీడీపీ బరిలోకి దింపుతోంది. గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2024 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నారు.

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బోణీ కొట్టాలని ఆరాటపడుతోంది. ఆ పార్టీ తరఫున అడారి ఆనంద్ పోటీ చేస్తున్నారు. విశాఖ డెయిరీ ఛైర్మన్, ఆర్ధికంగా బలమైన నేత కావడంతో విజయంపై ఆశలు పెట్టుకున్నారు. మరి టీడీపీ జోరుకు ఆయన బ్రేక్ వేస్తారా లేదా చతికిలపడతారా అన్నది తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Show More
Back to top button