
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మరోసారి పొడిగించింది. మొదట ఇచ్చిన గడువు 2024 జూన్ 14తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు దానిని 2026 జూన్ 14 వరకు పొడిగించారు.
పేరు మార్పు, చిరునామా మార్పు, ఉద్యోగ బదిలీ, పెళ్లి, చదువు కోసం గానీ.. ఇలా ఏ కారణం వల్ల అయినా ఆధార్లో మార్పులు చేయాలనుకునేవారికి ఇది మంచివార్త. ఈ మార్పులు ఇప్పుడు ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు UIDAI వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలి. ముందుగా ఆధార్ కేంద్రాల్లో మార్చాలంటే రూ.50 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనమే ఇంటి నుంచే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ డేటా ఆన్లైన్లో ఇలా అప్డేట్ చేసుకోండి
UIDAI అధికార వెబ్సైట్ లేదా My Aadhaar పోర్టల్కు వెళ్లండి.
స్క్రోల్ చేయగా Document Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
“Click to Submit” పై క్లిక్ చేయగానే, “Login to Aadhaar via OTP” అనే పేజీకి తీసుకెళ్తుంది.
అక్కడ మీ ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
మీ మొబైల్కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
మీ ఆధార్ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. వాటిలో ఏవైనా తప్పులుంటే చెక్ చేసి, Next పై క్లిక్ చేయండి.
డాక్యుమెంట్ అప్లోడ్ పేజీకి వెళ్లి, మీ మార్పులకు సంబంధించి సరైన పత్రాలు ఎంచుకొని అప్లోడ్ చేయండి. చిరునామా మారిస్తే అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి.
అన్ని వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత Next పై క్లిక్ చేయండి.
చివరికి మీకు ఒక 14 అంకెల URN (Update Request Number) వస్తుంది. దీని ద్వారా మీరు అప్డేట్ స్టేటస్ను ట్రాక్ చేయవచ్చు