HISTORY CULTURE AND LITERATURE

అంత్యక్రియలు, దహన సంస్కారాల్లో స్త్రీకి ఎందుకు అనుమతి లేదు.?

మనిషికి మరణం అనేది అనివార్యం. మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియలను, దహన సంస్కారాలను నిర్వహిస్తారు. అయితే హిందూ మతం ప్రకారం దహన సంస్కారాలకు కూడా అనేక నియమాలు ఉంటాయి. మన హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. కానీ ఆ నియమాల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఒక నియమం గురించి మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేమిటంటే.. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న మహిళలు అంత్యక్రియలకు స్మశానానికి వెళ్లకూడదు. ముఖ్యంగా ఆడవాళ్లు దహన సంస్కారాలకు దూరంగా ఉండాలి. హిందూ పురాణాల్లో మహిళలు దహన సంస్కారాలు చేయకూడదు అని ఎందుకు నియమాన్ని విధించారు. తెలుసుకుందాం.

గరుడ పురాణంలో స్త్రీల గురించి ఏం చెప్పబడింది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆడవాళ్లకు స్మశానంలో ప్రవేశం లేదు. ముఖ్యంగా హిందూమతంలో ఆడవాళ్లకు స్మశానానికి వెళ్లే అనుమతి లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఎటువంటి కారణం లేకుండా పెద్దలు ఈ నియమాన్ని విధించరు కదా? ఆడవాళ్లకు స్మశానంలో ప్రవేశం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో చాలా చోట్ల ముఖ్యంగా నగరాలలో మహిళలు అంత్యక్రియల సమయంలో స్మశానాలకు వెళ్లి దహన సంస్కారాలు చేస్తున్నారు. ఇది మారుతున్న కాలానికి నిదర్శనంగా ఉన్నప్పటికీ ఇప్పటికే మన సంస్కృతిని, మతాన్ని పాటించే వాళ్లకు మాత్రం ఆడవాళ్లు స్మశానానికి వెళ్లడమే ఒక మహా పాపంతో సమానం. హిందూ పురాణాలలో ఆడవాళ్లను స్మశానాలకు వెళ్లకుండా ఎందుకు నిషేధించారు. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనిషి చనిపోతే కడసారి చూపు కోసం కూడా ఆడవాళ్లకు స్మశాన వాటికలోకి ప్రవేశం లేదు. దహన సంస్కారాలకు మహిళలు దూరంగా ఉండాల్సిందే. చితికి నిప్పు పెట్టడానికి కూడా మహిళలకు హక్కు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలకు దహన సంస్కారాలు నిర్వహించడాన్ని నిషేధించారు. అసలు హిందూ పురాణంలో ఈ విధంగా ఎందుకు నియమాలు విధించారు. తెలుసుకోవడానికి  రీసెర్చ్ లు కూడా జరిగాయి.

ఇప్పటి కాలంలో ఒకవేళ చనిపోయిన వాళ్లకు మగపిల్లలు లేకపోయినా వాళ్ల కుటుంబాల్లో ఎవరు మగవారు లేకపోయినా మిగతా వాళ్లంతా కలిసి చర్చించుకుని దగ్గర బంధువులు లేదా బాగా అన్యోన్యంగా ఉండే వాళ్ళ ద్వారా చితికి నిప్పు పెట్టిస్తారు. కూతురు, భార్య చితికి నిప్పు పెట్టే అవకాశం లేదు. హిందూ సంప్రదాయంలో అనేక విషయాలలో మహిళలకు షరతులు ఉంటాయి. కొన్ని ఆలయాలకు వెళ్ళకూడదు, అలాగే గర్భగుడి ప్రవేశం ఉండదు, అలాగే కొన్ని పూజల కార్యక్రమాలకు, చితికి నిప్పు పెట్టడానికి శవాలను మోయడానికి స్మశానానికి వెళ్లడానికి అనుమతి లేదు. ఇలాంటి సాంప్రదాయాలు హిందూమతంలో సమాధానం లేని ప్రశ్నలు. కానీ స్మశానానికి మహిళలను నిషేధించడం వెనుక ఆసక్తికర నిజాలు, నమ్మకాలు ఉన్నాయి.

ఎక్కడ మహిళలు తమకు అత్యంత ప్రీతికరమైన శవాలను కూడా మోయడానికి అనుమతి ఇవ్వరు. అంత్యక్రియల్లో భాగంగా శవయాత్రలో పాల్గొనడానికి కూడా హిందూమతంలో అంగీకరించరు. మహిళలు అంత్యక్రియలో పాల్గొనడానికి నిషేధించడంపై పురాణాల ఆధారంగా రీసెర్చ్ చేశారు. మహాభారత సమయంలో కొంతమంది మహిళలు ఈ అంత్యక్రియల్లో పాల్గొనే వారట. భీష్ముని అంత్యక్రియలో కౌరవులు, పాండవులతో పాటు మహిళలు కూడా పాల్గొన్నట్లు పురాణాల ద్వారా తెలుసుకున్నారు. ఇంటినీ, పిల్లలను కార్యక్రమానికి వచ్చిన బంధువులను చూసుకోవడం కోసం ఈ అంత్యక్రియలకు మహిళలను నిషేధించారని ఒక నమ్మకం ఉంది.

మగవారు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకుంటారు. దానికోసమే ఇలా నిర్ణయించారని చాలామంది భావిస్తారు. పూర్వం నరకానికి, స్వర్గానికి వారధిగా కొడుకును భావించేవారు. చనిపోయిన వారు అంత్యక్రియలను చితికి నిప్పు పెట్టే పని కొడుకు నిర్వహిస్తే చనిపోయిన వారు స్వర్గానికి వెళతారని ఒక నమ్మకం ఉండేది. అందుకే కొడుకు లేదా కొడుకుతో సమానమైన వాళ్లతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ కాలంలో ఆడ, మగ సమనమని అందరూ చెబుతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఆడవాళ్లు మగవాళ్ళ కంటే మానసికంగా ఎంతో బలహీనంగా ఉంటారు. గతంలో మహిళలు చాలా సున్నితమైన వారని, చాలా త్వరగా భావోద్వేగానికి గురవుతారని భావించేవారు. అందుకే ఈ అంత్యక్రియలు, చితికి నిప్పు పెట్టే పనులు చూసి వాళ్లు తట్టుకోలేరని అందుకే ఈ కార్యానికి దూరంగా పెట్టారని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరో షాకింగ్ నమ్మకం కూడా దీని వెనక ఉంది. అంత్యక్రియల సమయంలో మంచి చెడు రెండు స్మశానంలో ఉంటాయట.మహిళలు సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్లను నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ టార్గెట్ చేసే అవకాశం ఉందని మహిళలను స్మశాన వాటికకు నిషేధించే సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు పూర్వికులు.

అంటే అంత్యక్రియల సమయంలో దెయ్యాలు మహిళలను చాలా త్వరగా, తేలికగా ఆకర్షిస్తాయని భావించి ఈ ఆచారం తీసుకొచ్చారని చెబుతారు. ఇకపోతే ఎవరైనా అంత్యక్రియలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఏడుస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదు అని గరుడ పురాణంలో చెప్పబడింది. ఒక మృతదేహాన్ని చూసి ఒక ఆడమనిషి ఏడవకుండా ఉండడం అసాధ్యం. ఆడవాళ్లు ఎక్కువ సున్నిత హృదయాన్ని కలిగిన వాళ్లు కాబట్టి వారు తమ ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. అందుకే చనిపోయిన వ్యక్తికి ఆత్మశాంతి కలగాలని ఉద్దేశంతో ఆడవాళ్ళను స్మశానానికి తీసుకువెళ్లరు అని పండితులు చెబుతున్నారు.

కేవలం ఆడవాళ్లే కాదు చిన్న పిల్లలు కూడా స్మశానానికి వెళ్ళకూడదు. పిల్లలు స్మశానం లో ఉన్న పరిస్థితిని చూసి కచ్చితంగా భయపడి పోతారు. స్మశానంలో ఎన్నో శవాలను కాలుస్తూ ఉంటారు. అలా కాల్చేటప్పుడు శవం తల మీద కర్రతో  కొట్టడం ఒక సాంప్రదాయం. అంతేకాదు కాలుతున్న శవం ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అటువంటి దృశ్యాలను చూసే స్త్రీలు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతారు. భయపడడమే కాకుండా ఇది వారి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకనే పిల్లలను స్మశానానికి తీసుకు వెళ్లడం చాలా ప్రమాదకరం. స్త్రీలు కూడా ఎంతో సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్లు కూడా అంత్యక్రియలకు దూరంగా ఉండాలి.

అన్ని మతాలకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి. హిందూ మతంలో ఎన్నో కట్టుబాట్లు, నియమాలు, నమ్మకాలు కూడా  ఉన్నాయి.  గరుడ పురాణం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. మృతదేహాన్ని స్మశానానికి తీసుకు వెళ్లిన తర్వాత ఇంటిని శుద్ధి చేయడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఆడవాళ్ళని ఇంట్లోనే ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే ఇటువంటి బాధ్యతలను కేవలం స్త్రీలు మాత్రమే చక్కగా నిర్వర్తించగలుగుతారు. అందుకనే స్త్రీలు ఇంట్లో ఉంటే మగవారు దహన సంస్కారాలకు వెళ్లి అంత్యక్రియలను  నిర్వహిస్తారు.

ఇక సైన్స్ పరంగా మాట్లాడుకుంటే మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు ఆ మృతదేహం నుండి బ్యాక్టీరియా ఆ చుట్టుపక్కల వాతావరణంలో వ్యాపిస్తుంది. అంతేకాకుండా అంత్యక్రియలకు వెళ్లిన వాళ్ల మీద కూడా నెగిటివ్ ఎనర్జీ పడుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని మగవాళ్ళు తట్టుకోగలరు. కానీ ఆడవాళ్ళు మాత్రం తట్టుకోలేరు. స్మశానానికి వెళ్లి వచ్చిన తర్వాత పసుపు నీళ్లతో స్నానం చేయడం మన సాంప్రదాయం. దీనివల్ల బ్యాక్టీరియా మొత్తం తొలగిపోతుంది. శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇలా చేయకపోతే అది అశుభంగా భావిస్తారు.

కాబట్టి స్మశానానికి వెళ్ళొచ్చిన వాళ్ళు పసుపు నీళ్లతో స్నానం చేసేందుకు, తమని తాము శుద్ధి చేసుకునేందుకు ఎవరో ఒకరు సహాయంగా ఉండాలి. కాబట్టి ఆడవాళ్లను ఇంటికి పరిమితం చేశారు మన పెద్దలు. ఇక దుష్టశక్తులకు ఎక్కువగా ఆడవాళ్లే ప్రభావితం అవుతారు. దెయ్యాలు, భూతాలు వంటివి స్మశానాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అవి ఆడవాళ్లను పట్టిపీడించే సమస్య కూడా ఉంది. అందుకే స్మశానానికి ఆడవాళ్ళను దూరంగా ఉంచుతారు. ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయిల పైన ఈ దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అవి వారిని బలహీనులుగా చేస్తూ వారి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఈ దుష్టశక్తుల భయంకరమైన ప్రభావం నుండి ఆడవాళ్ళను రక్షించడానికి కూడా మన పురాణాలు ఆడవాళ్లను స్మశానానికి దూరంగా ఉంచినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏమిటంటే స్మశానానికి వెళ్లి ఎవరైతే దహన సంస్కారాలు చేస్తారో వాళ్లు గుండు కొట్టించుకోవడం ఆనవాయితీ. స్త్రీలైనా, పురుషులైనా సరే ఖచ్చితంగా గుండు కొట్టించుకోవాలి. అందుకనే ఆడవాళ్లు స్మశానానికి వెళ్లడానికి అనుమతి లేదు. ఎందుకంటే స్త్రీలు గుండు కొట్టించుకోవడం కూడా అశుభంగా హిందూమతంలో చెప్పబడింది. కేవలం భర్తను కోల్పోయిన స్త్రీలు మాత్రమే గుండు కొట్టించుకుంటూ ఉంటారు.

లేదా ఏదైనా దేవుని మొక్కు ఉన్నవారు గుండు కొట్టించుకుంటారు. అంతకుమించి అంత్యక్రియలకు వెళ్లి గుండు కొట్టించుకోవడం మంచిది కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు జనాల ఆలోచనలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఇప్పటి కాలపు అమ్మాయిలు ఎవరి మాట వినడం లేదు. వాళ్ళు హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను చాలా చోట్ల పాటించడం లేదు. మన హిందూ పురాణాల్లో చెప్పిన నియమాలను మూఢనమ్మకాలుగా భావించి తమకు నచ్చినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. కానీ మన పెద్దలు, పురాణాలు నియమించిన నియమాల   వెనుక ఒక ఖచ్చితమైన కారణం ఉంటుంది అని అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం.

Show More
Back to top button