Telugu News

ఏపీలో జిల్లాలు, మండలాలు పేర్లు మార్పు

ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక దూరం, చారిత్రక-సాంస్కృతిక నేపథ్యం, జనాభా, అభివృద్ధి లోపాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నది. ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను, అభ్యంతరాలను కూడా ఉపసంఘం గౌరవించాల్సి ఉంటుంది. దీనిపై తగిన సూచనలు చేయాలని మంత్రుల సమితిని ఆదేశించింది. రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Show More
Back to top button