
హైదరాబాద్ భక్తుల కోసం IRCTC టూరిజం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్యాకేజీని ప్రకటించింది. 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పవిత్ర ధామాలను దర్శించుకోవచ్చు. ప్రయాణ వివరాలు
ప్రారంభ తేదీ: 2026 మే 17
ప్రయాణ మార్గం: హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ వరకు విమాన ప్రయాణం
సమయాలు: ఉదయం 08:45కు హైదరాబాద్లో బయలుదేరి, 11:15కు డెహ్రాడూన్ చేరుకుంటారు. తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం 05:45కు బయలుదేరి రాత్రి 08:15కు హైదరాబాద్ చేరుకుంటారు.
యాత్ర విశేషాలు
యమునోత్రి: డెహ్రాడూన్ నుండి బర్కోట్ మీదుగా జాంకీ చట్టి చేరుకుని, అక్కడ నుండి యమునోత్రికి ట్రెక్కింగ్. ఇక్కడ సూర్యకుండ్, దివ్యా శిల ప్రసిద్ధి.
గంగోత్రి: ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ్ ఆలయ దర్శనం తర్వాత, భగీరథీ నది తీరాన ఉన్న గంగోత్రి ఆలయ దర్శనం.
కేదార్నాథ్: గుప్త్కాశీ నుండి సోన్ ప్రయాగ్ చేరుకుని, అక్కడ నుండి 16 కి.మీ. ట్రెక్కింగ్ లేదా పొనీ/పల్లకి ద్వారా కేదార్నాథ్ చేరుకోవచ్చు.
బద్రీనాథ్: విష్ణుమూర్తి కొలువై ఉన్న ఈ ధామంలో తప్త కుండ్, బ్రహ్మకపాల్ మరియు సమీపంలోని మానా గ్రామం (భారతదేశ చివరి గ్రామం) చూడవచ్చు.
హరిద్వార్: యాత్ర ముగింపులో హరిద్వార్లో పవిత్ర గంగా హారతి దర్శనం.
ప్యాకేజీ ధరలు:
సింగిల్ ఆక్యుపెన్సీ – రూ.91,610
డబుల్ ఆక్యుపెన్సీ – రూ.79,440
ట్రిపుల్ ఆక్యుపెన్సీ – రూ.74,430
ప్యాకేజీలో కలిగే సౌకర్యాలు:
ఫ్లైట్ టికెట్లు (అప్ అండ్ డౌన్).
హోటల్ వసతి,
బ్రేక్ఫాస్ట్ డిన్నర్.
స్థానిక రవాణా (AC వాహనం – కొండ ప్రాంతాల్లో AC ఉండదు).
ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు.
రోజుకు ఒక లీటర్ వాటర్ బాటిల్.
ముఖ్యమైన గమనికలు:రిజిస్ట్రేషన్: ప్రయాణానికి ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పోర్టల్లో Char Dham Registration తప్పనిసరిగా చేసుకోవాలి.
వ్యక్తిగత ఖర్చులు: పొనీ, పల్లకి, హెలికాప్టర్ సర్వీస్, ఎంట్రీ టికెట్లు, గైడ్ ఫీజులు పర్యాటకులే భరించాలి.
గుర్తింపు కార్డు: ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడి ప్రూఫ్ (Aadhar/Voter ID) వెంట ఉంచుకోవాలి.










