
ఐపీఎల్ 2025 సీజన్లో సంచలనం సృష్టించిన సంఘటన పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరిన తీరు. పదకొండేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబయిని చిత్తు చేసిన రెండో క్వాలిఫయర్లో శ్రేయస్ అజేయంగా నిలిచాడు. ఈ విజయం ద్వారా శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు మూడు వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు. 2020లో ఢిల్లీ, 2024లో కోల్కతా, ఇప్పుడు 2025లో పంజాబ్ కింగ్స్ను టైటిల్ పోరుకు చేర్చాడు. రూ. 26.75 కోట్లకు శ్రేయస్ను సొంతం చేసుకున్న పంజాబ్ నిర్ణయం సఫలమైంది.
శాంతంగా… శక్తివంతంగా
“ఇలాంటప్పుడు శాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ఒక్క విజయం లేదా ఓటమితో ఏ జట్టు స్థాయిని తేల్చలేం” అని శ్రేయస్ అన్న మాటలు ఇప్పుడు జట్టు మానసిక దృఢతను తెలియజేస్తున్నాయి. తొలి క్వాలిఫయర్లో పరాజయం ఎదురైనా, ఆ బాధను మరిచి, తదుపరి మ్యాచ్లో అలర్ట్గా ఆడిన Entire టీమ్ విజయం సాధించింది. శ్రేయస్తోపాటు ఇతర ఆటగాళ్లు జట్టుగా పని చేశారు. నేహాల్ వధేరా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడగా, బ్యాటింగ్లో నిర్ణయాత్మక స్టార్ట్తో ముంబయిని ఒత్తిడిలోకి నెట్టేశారు.
రికార్డులు రాజేసిన రాత్రి
204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా, ముంబయి ఇండియన్స్కు ఇదే ఐపీఎల్ చరిత్రలో తొలి సారి 200+ టార్గెట్ను కాపాడుకోలేకపోయిన సందర్భం. 19 మ్యాచుల్లో 200+ స్కోరు చేసి 18 విజయాలు అందుకున్న ముంబయికి ఈ ఓటమితో ఓ చెత్త రికార్టును నెలకోల్పుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో 204 పరుగుల ఛేదన ఇదే గరిష్టం కావడం గమనార్హం. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో 200+ లక్ష్యాలను ఛేదించిన ఎనిమిదో విజయం ఇది. ముంబయిపై 200+ ఛేదించిన తొలి జట్టుగా పంజాబ్ నిలవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.