NRI News

ప్రవాస భారతీయుల ఐక్యతకు ప్రతీకగా వికసిత భారత్ రన్

న్యూజెర్సీ (New Jersey)లోని శ్రీ శివ విష్ణు ఆలయం – సాయిదత్త పీఠం (Sai Datta Peetham) సెప్టెంబర్ 28, 2025 ఉదయం 9 గంటలకు “వికసిత భారత్ రన్”ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ రన్ 1665 Oaktree Road, Edison, NJలోని ఆలయ ప్రాంగణంలో జరగనుంది.

భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తున్న చారిత్రక యాత్రను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. FIT India, Startup India, Make-in-India వంటి జాతీయ ఉద్యమాలను ప్రోత్సహించడం, అలాగే డిజిటల్ ఇండియా, UPI వంటి సాంకేతిక పురోగతులను వెలుగులోకి తేవడం కూడా ఈ రన్ ప్రత్యేకత.

భారత్ – అమెరికా (India-USA) మైత్రి సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం వేదికగా మారనుంది. ప్రవాస భారతీయుల ఐక్యత, సహకారం, “వికసిత భారత్” సాధనలో ఎంత కీలకమో ఈ రన్ ద్వారా చూపించనున్నారు.

సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో, స్థానిక మరియు జాతీయ ప్రవాస భారతీయ సంస్థలతో కలిసి ఈ రన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పాల్గొనే వారందరికీ ఉత్సాహాన్ని నింపే ఈవెంట్ అనంతరం తేలికపాటి అల్పాహారం కూడా అందించబడుతుంది.

ప్రవాస భారతీయులలో భారత అభివృద్ధి పట్ల గర్వాన్ని, రెండు దేశాల మధ్య మైత్రి బంధాలను, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రతిబింబించే ఈ రన్, “వికసిత భారత్” లక్ష్యానికి ప్రతీకగా నిలవనుంది.

Show More
Back to top button