
కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు పర్యటించి, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు.
తెలంగాణ
నవంబర్ -30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
నవంబర్ – 3న ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ – 10 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
నవంబర్ – 13న నామినేషన్ల పరిశీలన
నవంబర్ – 15న నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ – 3న ఎన్నికల కౌంటింగ్
మిజోరాం
అక్టోబర్ 13 – ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 7 – పోలింగ్
డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు
రాజస్థాన్
అక్టోబర్ 30 – ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 23 – పోలింగ్
డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు
ఛత్తీస్గఢ్
అక్టోబర్ 13- ఫేజ్-1 ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 21 – ఫేజ్-2 ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 7 – ఫేజ్-1 పోలింగ్
నవంబర్ 17 – ఫేజ్ -2 పోలింగ్ డిసెంబర్ 3 – ఫేజ్-1 & ఫేజ్-2 ఎన్నికల ఫలితాలు
మధ్య ప్రదేశ్
అక్టోబర్ 21 – ఎన్నికల నోటిఫికేషన్
నవంబర్ 17 – పోలింగ్
డిసెంబర్ 3 – ఎన్నికల ఫలితాలు