
ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్. ఆరవళి పర్వతాల్లో 4,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం చల్లని వాతావరణం కావాలనుకునేవాళ్లకు బెస్ట్ ఆప్షన్. ఇక్కడే ఉన్న నక్కి లేక్ (Nakki Lake) మౌంట్ అబూకి ప్రధాన ఆకర్షణ. ఇది సహజంగా ఏర్పడిన సరస్సు కాదు. కొన్ని పురాణాల ప్రకారం దేవతలు తమ నఖాలతో (నక్కులతో) ఈ సరస్సును త్రవ్వారని చెప్పడంతో దీనికి “నక్కి లేక్” అనే పేరు వచ్చింది.
నక్కి లేక్ చుట్టూ చిన్న ఓడలతో రైడ్ చేయవచ్చు. బోటింగ్ చేస్తూ చుట్టూ పచ్చదనం, కొండలు, అందమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. సరస్సు పక్కనే ఉండే గార్డెన్లు, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ స్ట్రీట్స్ అక్కడి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఎప్పుడూ బిజీగా ఉండే డిల్వారా జైన టెంపుల్స్, టాడ్ రాక్, సన్సెట్ పాయింట్ లాంటివి మరిన్ని చూడదగిన ప్రదేశాలు.
తెలుగు రాష్ట్రాల నుంచి మౌంట్ అబూ చేరాలంటే ముందుగా అబూ రోడ్ స్టేషన్కి రైలు లేదా అజ్మీర్ లేదా ఉదయపూర్కి విమానం తీసుకుని రావాలి. అబూ రోడ్కి వెళ్లిన తర్వాత టాక్సీలు, బస్సులు మౌంట్ అబూ వరకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి జోధ్పూర్, అజ్మీర్ దిశగా వెళ్లే రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రిప్కి కనీసం మూడు రోజులు అవసరం అవుతుంది.
ఆహారానికి రోజుకు ఒక్కరికీ రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చవుతుంది.
నివాసానికి హోటళ్లు, హోంస్టేలు రోజుకు రూ.1200 నుంచి రూ.2000 వరకు ఉండొచ్చు. బోటింగ్, లోకల్ ట్రావెలింగ్ కోసం అదనంగా రూ.500–700 అవసరం అవుతుంది.
ఇక్కడ కెనడా షూస్, జైన హస్తకళలు, రాజస్థానీ వస్త్రాలు, హ్యాండ్మేడ్ ఐటెంలు కొనేందుకు చుట్టూ మంచి మార్కెట్లు ఉన్నాయి. షాపింగ్ బడ్జెట్ కూడా తీసుకెళ్లడం మంచిదే.












