
జైసల్మేర్ పేరు విన్నారా..? అయితే ఈ ప్రదేశం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారి మధ్యలో ఉన్న ఈ నగరాన్ని “గోల్డెన్ సిటీ” అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి ఇళ్లు, కోటలు, హవేలీలు అన్నీ పసుపు రంగు రాళ్లతో నిర్మించబడి బంగారు వెలుగులా మెరిసిపోతాయి. ఇక్కడి చారిత్రక కోటలు, ఎడారి సఫారీలు, రాజస్థానీ సంస్కృతి ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ.
జైసల్మేర్లో చూడాల్సిన ప్రదేశాలు:
*జైసల్మేర్ కోట (Sonar Quila)
*పట్వాన్ కి హవేలీ
*సామ్ సాండ్ డ్యూన్స్ – ఎడారి ఒంటెల సఫారీకి ప్రసిద్ధి
*గదిసర్ సరస్సు
*నాథ్మల్ కి హవేలీ
*సలీం సింగ్ కి హవేలీ
జైసల్మేర్ ఎలా చేరుకోవాలి:
బస్సు మార్గం: జైపూర్, జోధ్పూర్, బికానేర్ నగరాల నుండి డైరెక్ట్ బస్సులు లభిస్తాయి.
రైలు మార్గం: జైసల్మేర్ రైల్వే స్టేషన్ ప్రధాన నగరాలతో బాగా కలుపబడింది. ఢిల్లీ, జైపూర్ నుండి స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి.
ఎయిర్ మార్గం: జైసల్మేర్ ఎయిర్పోర్ట్ సీజనల్గా పనిచేస్తుంది. సమీప అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ జోధ్పూర్ (285 కి.మీ).
టూర్ బడ్జెట్:
జైసల్మేర్కి రానుపోను ఖర్చులు సుమారు రూ.4000 నుంచి రూ.7000 వరకు ఉంటాయి. రూమ్ అద్దె రోజుకు రూ.1000 నుంచి రూ.2500 వరకు, ఫుడ్కి రోజుకు రూ.600, గైడ్కి రూ.800, ఎడారి సఫారీకి రూ.1200 వరకు ఖర్చవుతుంది.












