
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. పలు కీలకమైన హామీలతో కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పింఛన్లు, మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు. మేనిఫెస్టోలో కీలక విషయాలను ఈ క్రింది విధంగా చూడవచ్చు.
- * మెగా డీఎస్సీపై మొదటి సంతకం
- * చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- * పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
- * సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్ నుంచే వర్తింపు)
- * ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
- * తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
- * డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
- * మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- * దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
- * బీసీలకు 50 ఏళ్లకే పింఛను
- * 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
- * యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- * నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
- * స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం
- * చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
- * రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం
- * వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు
- * ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం
- * ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
- * ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
- * భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ
- * పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ
- * ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ
- * చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు
- * నాయీ బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం
- * మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం