Telugu News

జులై 1 నుంచి రాబోయే కొత్త మార్పులు ఇవే!

ఈసారి జులై నెలలో ఆర్థికంగా అనేక మార్పులు రాబోతున్నాయి. అందులో చాలావరకు మనపై నేరుగా ప్రభావం చూపేవే తత్కాల్ రూల్స్, ఆధార్-పాన్, క్రెడిట్ కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని అవగాహన పెంచుకుందాం:

పాన్ కు ఆధార్ తప్పనిసరి..

పాన్ కార్డు తీసుకోవాలంటే ఇకపై ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే! జులై 1 నుంచి పాన్ కోసం ఆధార్ నంబర్, ఆధార్ వెరిఫికేషన్ ను సీబీడీటీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏదైనా గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికేట్ లాంటివి ఉంటే పాన్ జారీ చేసి, ఇస్తున్నారు. కానీ ఇకపై పాన్ కార్డు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వివరాలు ఇవ్వాల్సిందే. పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ఇది కొత్త మార్పుగా చెప్పవచ్చు.

తత్కాల్ రూల్స్.. రైల్వే చార్జీల సవరణ..

*ఆధార్ ఆథేంటికేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే జులై 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. టికెట్ల బుకింగ్ విషయంలో జరిగే అన్ నౌన్ ట్రాన్సాక్షన్స్, అక్రమాలను అరికట్టేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చింది. 

*జులై 15 నుంచి బుకింగ్ సమయంలో ఆధార్  ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇదే కాక రైల్వే శాఖ.. రైల్వే ఆధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే టికెట్లు బుక్ చేసే అవకాశమిచ్చింది. 

అంటే ఏసీకి ఉదయం 10.30, నాన్ ఏసీకైతే 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్లు ఇకపై బుక్ చేసుకోగలరు. జులై 15 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.

*మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ తరగతులకు 2 పైసల చొప్పున ధరలు పెంచింది. 500 కిలోమీటర్లు దాటాక సెకండ్ క్లాస్ ప్రయాణానికి కిలోమీటరుకు ఒక పైసా వర్తిస్తుంది. పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలవుతాయి.

క్రెడిట్ కార్డు రూల్స్ మార్పు..

హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. రూ.10వేలు పైబడి వాలెట్ లోడింగ్, రూ.5 వేలు పైబడి యుటిలిటీ పేమెంట్లు, రూ.10 వేలు దాటిన గేమింగ్ ట్రాన్సాక్షన్లపై ఇకపై 1 శాతం ఫీజు వర్తిస్తుంది. 

అన్ని రెంటల్ పేమెంట్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్ల పైన 1శాతం ఫీజు పడనుంది. ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలపై రివార్డులను పూర్తిగా తొలగించింది. జులై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయి.

ఐటీఆర్ ఫైలింగ్..

వాస్తవానికి జూన్, జులై నెలలంటే.. ఐటీఆర్ ఫైల్ చేసే టైం. ఇందుకోసం టాక్స్ పేయర్స్ ఎదురు చూస్తుంటారు. అలాంటి ఐటీఆర్ ఫారాల్లోనూ మార్పులు చేయడం జరిగింది. ఫైలింగ్ గడువును కేంద్రం సెప్టెంబర్ 15 వరకూ పొడిగించడంతో..

పన్ను చెల్లింపుదారుడికి 45రోజుల పాటు అదనపు సమయం దొరికింది. ఒకవేళ అన్ని పేపర్స్ మీ దగ్గరుంటే గడువు తేదీతో సంబంధం లేకుండా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు.

Show More
Back to top button