
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ already పాకిస్థాన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ సమయంలోనే పాకిస్థాన్కు మరో దెబ్బ తగిలింది. దేశంలో విస్తీర్ణపరంగా అతి పెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్ నుండి వేరుపడాలని అక్కడి నేతలు బహిరంగంగా ప్రకటించారు. బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ట్విట్టర్ (X) లో పలు కీలక పోస్టులు చేస్తూ, బలూచిస్థాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. “రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్” ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. అంతేకాక, భారతదేశం మరియు ఐక్యరాజ్య సమితి తమ స్వతంత్రతను గుర్తించాలని కోరారు. ప్రత్యేక దేశంగా గుర్తింపు, దానికి సంబంధించిన అధికారిక వనరులు కావాలంటూ మెస్సేజ్లు పంపించారు.
యూఎన్, భారత్ను కోరిన బలూచ్ నేతలు మీర్ యార్ బలూచ్ చేసిన పోస్టుల్లో బలూచ్ జెండాలతో, మ్యాపులతో పెద్దఎత్తున ప్రజలు కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి తమకు ఏ సంబంధం లేదని, తమను స్వతంత్ర దేశంగా పరిగణించాలంటూ వారు కోరుతున్నారు. బలూచిస్థాన్కు ప్రత్యేక రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా, కరెన్సీ, పాస్పోర్టు, ఇతర అంతర్జాతీయ గుర్తింపుల కోసం యునైటెడ్ నేషన్స్ను సంప్రదించారు. భారత మీడియా తమను పాకిస్థాన్ ప్రజలతో పోల్చకుండా, వేరు దేశంగా చూపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం అంశం పాకిస్థాన్కు అంతర్గతంగా పెద్ద తలనొప్పిగా మారింది.
కషీష్ చౌదరి ఘనత – బలూచిస్థాన్లో మైనార్టీల విజయగాథ ఈ నేపథ్యంలో, మరోవైపు కషీష్ చౌదరి అనే పాకిస్థాన్కు చెందిన హిందూ యువతి చరిత్ర సృష్టించింది. ఆమె బలూచిస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాన్ని పొందింది. కషీష్ బలూచిస్థాన్ ప్రాంతంలో ఇటువంటి గౌరవాన్ని సాధించిన తొలి మైనార్టీ మహిళగా నిలిచింది. ఆమె విజయంతో బలూచిస్థాన్లో మైనార్టీల అభివృద్ధికి నూతన ఆరంభంగా భావిస్తున్నారు. ఇటువంటి ఘనతలు ఒకవైపు సాధించబడుతుండగా, మరోవైపు ప్రాంతీయ వేర్పాటువాదాలు ఉధృతం కావడం పాకిస్థాన్కు డిప్లొమాటిక్గా సవాళ్లను పెంచుతోంది.