
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ అయిన EPFO తమ చందాదారులకు ఒక బిగ్ అలర్ట్ ను ఇచ్చింది.
ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించిన సేవల విషయంలో థర్డ్ పార్టీ ఏజెంట్ల సాయం తీసుకోవద్దని సూచించింది. దీనివల్ల ఎంప్లాయర్ కి చెందిన కీలక వివరాలు వారికి చిక్కే ప్రమాదం లేకపోలేదు. బదులుగా ఆన్లైన్ పోర్టల్ లో స్వయంగా ఉచిత సేవలను వినియోగించుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత సులువుగా, వేగంతో, పారదర్శకతతో సేవలను అందిస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని సేవలూ ఇప్పటికే ఫ్రీగా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ సేవల కోసం కొన్ని సైబర్ కేఫ్ లు/ ఫిన్లేడ్ లాంటి కంపెనీలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కార్మికశాఖ గుర్తించడం విశేషం.
కాబట్టి చందాదారులు ఉచితంగా, సొంతంగా చేసుకోగలిగే వాటికి నగదును వసూలు చేసే థర్డ్ పార్టీ సేవలను ఆశ్రయించవద్దని చెబుతోంది.
బదులుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ అయిన ఉమాంగ్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా క్లెయిమ్ సెట్టిల్డ్, కేవైసీ అప్డేడేషన్, గ్రీవెన్స్ లాంటి ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉచితంగానే లభిస్తున్నాయి. ఇవికాక ఇతర సమస్యలు ఏవైనా ఉంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ డెస్క్ ను సంప్రదించొచ్చు.
సులభతరం చేసిన సేవలు ఏవంటే..
*అన్ హెల్తీ, పెళ్లి, చదువు లాంటి కారణాలపై అడ్వాన్స్ చెల్లింపులకున్న ఆటోక్లెయిమ్ సెటిల్మెంట్ ను ఇప్పుడు రూ.1 లక్షకు పెంచింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంతో మొత్తం 2.34 కోట్ల క్లెయిమ్ లనేవి ఈ మోడ్ లోనే పరిష్కారమయ్యాయి.
*ట్రాన్సఫర్ క్లెయిమ్ ను సైతం 2025 జనవరి 15 నుంచి ఈపీఎఫ్ఓ ఈజీ చేసేసింది.
*ఆధార్ అథంటికేషన్ లో ప్రొఫైల్లో కరెక్షన్ చేసుకునే వీలు కల్పించింది. ఎంప్లాయర్ పై ఆధారపడడాన్ని తగ్గించింది.
*ఉమాంగ్ యాప్ ని ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీ ద్వారా యూఏఎన్ అలాటిమెంట్, యాక్టివేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
*క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం చెక్ లీఫ్/ అబ్జెస్ట్ చేసిన పాస్ బుక్ ఇమేజ్ అప్ లోడింగ్ అవసరాన్ని ఇంతటితో తొలగించింది.
*బ్యాంక్ అకౌంట్ సీడింగ్ కు ఎంప్లాయర్ ఆమోదాన్ని కూడా ఈపీఎఫ్ఓ తప్పించింది.