
చాలామందికి రాత్రిపూట నిద్రించేముందు మొబైల్ను దిండు దగ్గర పెట్టుకునే అలవాటు ఉంటుంది. రాత్రుల్లో కూడా మొబైల్ను వాడుతూ నిద్రించే సమయంలో ఆ మొబైల్ను దిండు కింద అలానే పెట్టుకొని పడుకోవడం పరిపాటైంది. ఇలా చేయడం మంచిదేనా?, నిర్లక్ష్యం వహించడం సబబేనా అంటే ఎంతకూ మంచిది కాదు. ఇదే గనుక కొనసాగితే మెదడు దెబ్బతింటుంది. మొబైల్ విడుదల చేసే రేడియేషన్ వల్ల ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.
వాస్తవానికి మొబైల్ ఫోన్ రేడియేషన్ మెదడుకు ప్రత్యక్షంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని WHO, ఇతర ప్రధాన ఆరోగ్య సంస్థలు, నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి పూర్తిగా ప్రమాదకరం! మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ మన మెదడు, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
*నిరంతర నోటిఫికేషన్లు, వైబ్రేషన్ అవ్వడం, స్క్రీన్ లైట్ కారణంగా మెదడు నిరంతరం చురుకుగా ఉండటం వల్ల సరైన నిద్ర పట్టదు.
*మొబైల్ ఫోన్ ల్లో బ్లూ లైట్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రత్యేకించి ఎక్కువసేపు సమీపంలో, దగ్గర్లో ఉంచినట్లయితే ఇబ్బంది మరింత ఎక్కువవుతుందని గుర్తుంచుకోవాలి.
*పడుకునేముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల బ్లూ రే ప్రసరిస్తుంది. ఇది కళ్లకు అలసటను కలిగిస్తుంది. నార్మల్, రెగ్యులర్ స్లీప్ సైకిల్ కి అంతరాయం, ఇబ్బంది కలిగిస్తుంది.
*సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
*కొన్ని సంఘటనల్లో మొబైల్ ఫోన్లు వేడెక్కడం, పేలడం వంటివి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అందువల్ల మొబైల్ ఫోన్ను దిండు పక్కన ఉంచడం, పక్కనే చర్గిన పెట్టుకొని ఉంచుకోవడం ప్రమాదకరం.
*వీలైతే మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మొబైల్ ఫోన్ను మీ నుంచి కొంచెం దూరంగా సైడ్ టేబుల్పై ఉంచడం బెటర్. లేదంటే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిని దిండు కింద లేదా ఏదైనా క్లాత్ కింద ఉంచకూడదు.
*పడుకునే గంట సమయానికి ముందు మొబైల్ ఫోన్ చూడకపోవడం వల్ల స్ట్రెస్ అనేది మీ దగ్గరికి రానేరాదు.