TRAVEL ATTRACTIONS

అందమైన అగర్తల చూద్దామా..!

ఒక మరపురాని అనుభవం కలిగించే ప్రయాణం చేయాలనుకుంటున్నారా..? అయితే అగర్తలను మీ బక్కెట్ లిస్ట్‌లో చేర్చండి. ఇది ఈశాన్య భారతదేశంలో ఒక దాగి ఉన్న రత్నంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి అందాలను చూడటానికి రెండు కనులు సరిపోవు. ఈ ప్రదేశానికి వెళ్లడానికి ఉత్తమ సమయం శీతాకాలం, అక్టోబర్ నుండి మార్చి వరకు అని చెబుతున్నారు పర్యాటకులు.

ఈ సమయంలో ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది త్రిపుర రాజధాని. హౌరా నది ఒడ్డున, బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉండే ఈ నగరానికి చేరుకోవడానికి రోడ్డు, విమానం లేదా రైలులో ప్రయాణించవచ్చు. మొత్తం పర్యటనను పూర్తి చేయడానికి దాదాపు 3 నుండి 4 రోజులు పడుతుంది. 

అగర్తలాలో సందర్శించవలసిన ప్రదేశాలు

* ఉజ్జయంత ప్యాలెస్

* సెపాహిజాలా వన్యప్రాణుల అభయారణ్యం

* త్రిపుర ప్రభుత్వ మ్యూజియం

* నీర్మహల్ ప్యాలెస్

* జంపూయ్ కొండ

* హెరిటేజ్ పార్క్

* కమలేశ్వరి ఆలయం

* ఉనకోటి రాతి శిల్పాలు

* దుర్గాబరి టీ ఎస్టేట్

మీరు ఎంచుకున్న రవాణా, హోటళ్ల అనుగుణంగా మీ పర్యటనా బడ్జెట్‌ను ప్లాన్ చేయండి.

Show More
Back to top button