ఆంధ్ర ప్రదేశ్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. 10 నుంచి 15 రోజుల పాటూ నిర్వహించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, షెడ్యూల్పై క్లారిటీ రావాల్సి ఉంది.