
ఒకప్పుడు పరీక్షల సీజన్ అంటే టేబుల్ మీద పుస్తకాలే దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు పుస్తకాలు కంటే ఎక్కువగా కనిపించేవి – చిప్స్ కవర్లు, బర్గర్ మిగతా భాగాలు, శీతల పానీయాల సీసాలు!
చదువు ముందుకెళ్లడం లేదు… గుర్తుపట్టలేకపోతున్నారు… ఫోకస్ తగ్గిపోయింది… ఇవన్నీ చాలా తల్లిదండ్రుల నుండి వినిపించే సాధారణ వ్యాఖ్యలు.
అలాగే, “ఇంట్లో చదువుతున్నాడు కానీ స్కూల్లో ఏమి గుర్తుండడం లేదు”, “ఒకే పేజీని మూడు సార్లు చదివినా ఫలితం లేదు” అన్న ఫిర్యాదులు రోజువారీగా మారిపోయాయి.
అయితే దీని వెనుక నిజమైన కారణం పుస్తకాలంటే అసహ్యం కాదు… చదవలేనంత తలబద్దకం కాదు… అసలు సమస్య – పిల్లలు తినే ఆహారం!
అందులోనూ ఎక్కువగా తినే జంక్ ఫుడ్ కారణం. ఇందులో ఉండే అధిక చక్కెర, నెయ్యిలాంటివి, రంగులు, నిల్వ పదార్థాలు మెదడుపై ప్రభావం చూపుతాయి. ఇవి మానసిక సాన్నిధ్యానికి అవసరమైన రసాయనాలను అసమతుల్యంగా మారుస్తాయి.
దీని వల్లే మనసు ఎటు పోతుందో తెలియకపోవడం, ఏ పని మీదా ఆసక్తి లేకపోవడం, చదువు పట్ల విసుగు రావడం జరుగుతోంది.
ఇక పిల్లలను తెలివిగలవారిగా తయారు చేయాలంటే… మొదట తినే ఆహారాన్ని మార్చాలి.
చిప్స్కి బదులు వేపిన శనగలు, చాక్లెట్కి బదులు చిన్న ముక్క నలుపు చాక్లెట్ తో పాటు అరటి, పాలను తాగకుండా నానబెట్టిన బాదంపప్పు ఇవ్వడం మంచి మార్గం.