
బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ కావాలా..? అయితే, పదండి దేవ్కుండ్ వాటర్ఫాల్కి వెళ్లిపోదాం. ఇది మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని కొలాడ్ సమీపంలో ఉంది. మూడు నదుల సంగమంగా(కలిసి) ఏర్పడిన జలపాతం ఇది. ఎత్తైన కొండపై ఉండటం వల్ల దీనిని చేరుకోవాలంటే దాదాపు 300 అడుగుల ఎత్తైన కొండను ఎక్కాల్సి ఉంటుంది. బేస్ గ్రామం నుంచి ఆరు కిలోమీటర్ల వెళ్లాల్సి ఉంటుంది. దీనికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.
చుట్టూ అందమైన అడవి.. మధ్యలో ఒక పెద్ద బండరాయి మీద నుంచి జలపాతం. చూడడానికి ఎంతో అందమైన ప్రదేశం. ఈ ప్రదేశం ప్రకృతి ఒడిలో ఉన్నట్లుందని అక్కడికి వెళ్లిన ప్రయాణికులు చెబుతున్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు ఈ జలపాతాన్ని దేవతల స్నానపు చెరువుగా పిలుస్తారు. ఇంత అందమైన జలపాతం చూడటానికి వెళ్లాలనుకుంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలనే విషయం ఇప్పుడు చూద్దాం.
దేవ్కుండ్ వాటర్ఫాల్కి వెళ్లడానికి మనం ముంబాయి లేదా పుణేకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి వైజాగ్, హైదరాబాద్, తిరుపతి నుంచి రైలు, విమానాలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత క్యాబ్, టాక్సి ద్వారా మీరు దేవ్కుండ్ చేరుకోవచ్చు. మీరు కావాలనుకుంటే సొంతంగా వెహికల్ బుక్ చేసుకుని కూడా వెళ్లవచ్చు. ఈ ప్రదేశానికి వెళ్లి రావడానికి 2 రోజులు సరిపోతుంది. అదే మీరు రైల్లో ప్రయాణిస్తున్నట్లైతే ఎక్కువ రోజులు పడుతుంది. ఈ టూర్కి బడ్జెట్ ఎంతవుతుందంటే..
ఆహారానికి రోజుకు ఒక్కరికీ రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది.
నివసించడానికి రూంకు ఒకరోజుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు అవుతుంది. మీరు రెండు రోజుల వరకు నివసించే అవకాశం ఉంటుంది.
మీరు షాపింగ్ చేయాలనుకుంటే దానికి కొంత డబ్బుని తీసుకుని వెళ్ళండి.