HISTORY CULTURE AND LITERATURE

మీనాక్షి ఆలయం, మదురై, తమిళనాడు

మదురై యొక్క శక్తివంతమైన నగరం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి – మీనాక్షి సుందరేశ్వర దేవాలయం. ఈ ఆలయం దాని అద్భుతమైన అందం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. శివుడు (లార్డ్ సుందరేశ్వర్) మరియు పార్వతి దేవత (మీనాక్షి)కి అంకితం చేయబడింది, ఇది 10 కంటే ఎక్కువ ముఖద్వారాలు, గోపురాలు మరియు అందమైన మండపాలు కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలోని క్లిష్టమైన చెక్కడాలు మరియు శక్తివంతమైన శిల్పాలు లార్డ్ సుందరేశ్వరర్ మరియు మీనాక్షి దేవతలకు సంబంధించిన పురాణాలు మరియు పురాణాల కథలను వివరిస్తాయి.

దేవాలయంలోని ప్రతి గోపురం అందమైన రంగులు, మరియు క్లిష్టమైన పౌరాణిక జీవులతో అలంకరించబడిన ఒక కళాఖండం. ఈ నిర్మాణ అద్భుతాలను చూడడానికి రెండూ కళ్ళు సరిపోవు. ఈ ఆలయం శాంతి మరియు ప్రశాంతత యొక్క అందమైన నివాసం

ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది,వారు తమ ప్రార్థనలు మరియు దైవిక ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈ ఆలయం యొక్క వాతావరణం ఆత్మను పోషిస్తుంది. అదనంగా, మీరు సోమసుందర (శివుడు) మరియు దేవత మీనాక్షి (పార్వతీ దేవి)కి అంకితం చేయబడిన, బాస్-రిలీఫ్‌తో చేసిన అద్భుతమైన అష్ట శక్తి మండపాన్ని చూస్తారు.

దేవతల క్రీడలను వర్ణించే చిత్ర మండపాలతో చుట్టుముట్టబడిన పొత్రమారావుకులం అని పిలువబడే బంగారు తామర తొట్టిలో భక్తులు స్నానాలు చేస్తారు. మీనాక్షి తిరుకల్యాణం (మీనాక్షి దేవి వివాహం) ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో ఇక్కడ జరుపుకుంటారు. ఈ సమయంలో, మీనాక్షి ఆలయం దైవిక మంత్రముగ్ధుల రాజ్యంగా మారుతుంది.

శ్రీ మీనాక్షి అమ్మవారి దేవాలయం తమిళనాడులోని చెన్నైకి 400.మి దూరంలో మదుర మధురై ై నగర. మీనాక్షి దేవాలయం మదురైలోని వేగాయి నది ఒడ్డున వున్నది. తమిళనాడు రాష్ట్ర సాంప్రదాయ వారసత్వాలు, కళలు, సంస్కృతి, మొదలైనవాటికి నిలయంగా ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి.

ఈ నగరాన్ని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది పరిపాలించారు.భారతదేశ సంస్కృతి, కళ మరియు ఆధ్యాత్మికతలో మధురై ముఖ్యమైన నగరాల్లో ఒకటి. మీనాక్షి అమ్మవారి ఆలయం, సుందరేశ్వర ఆలయం 2500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి.

ఈ ఆలయం అప్పటి జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలు మరియు చిత్రాలతో తమిళ సంస్కృతికి చిహ్నం. ఇది ప్రాచీన కాలం నుండి తమిళ సాహిత్యంలోప్రస్తావిస్తున్నారు. ఈ ఆలయం నగరం నడిబొడ్డున అమరి ఉన్నది.

మీనాక్షి దేవి ఆలయం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సందర్శించే ఆలయాలలో ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రతిరోజూ మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు.  వెయ్యి స్తంభాలతో కట్టిన మంటపం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది తమిళ కళలైన సంగీత, భరతనాట్యంకు వేదికగా చెబుతారు. మధురైలో ప్రముఖంగా చెప్పుకోవలసిన మీనాక్షి సుందరేశ్వరర్ దేవాలయం.

ఈ దేవాలయంలో ఈశ్వరుడు, మీనాక్షి దేవి విగ్రహాలు ఉన్నాయి. చేపకళ్ళ ఆకారంలో అతి సుందరంగా ఉన్న మీనాక్షిదేవితో పాటు ఈశ్వరుడు సుందరేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

ఈ సుందర నగరాన్ని గురించి గాయకులూ, కవీశ్వరులూ దివ్యగానం చేశారు. ఈఈ ప్రదేశంలోనే శక్తి దేవి మానవ రూపంలో అవతరించి, పాండ్య యువరాణిగా పరిపాలించి, భక్తుల రక్షణ కోసం దివ్యమైన మహిమలను ప్రదర్శించిన శివుని భార్యగా మారింది.  చిరునవ్వులు చిందించే ఆ రమణీయ ప్రదేశం నడుమ అద్భుతమైన సముదాయం ఎంతదూరంలో ఉన్నా చూసేవారిని ఆకర్షిస్తుంది. ముందుగా మీనాక్షి దేవిని దర్శించుకుని ఆ తర్వాత సుందరేశ్వర స్వామిని సేవించటం ఇక్కడి సంప్రదాయం. అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి.

* మధురై పురాణ గాథలు*

ఒకానొక సమయంలో,దివ్యలోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది.పాప పరిహారార్థం ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాల్లో తపస్సు చేశాడు. మదురై వద్ద కదంబవనం దాటుతూవుంటే తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది. ఏమి జరుగుతుందో పరిశీలించిన తర్వాత ఆ కదంబ వృక్షం కింద స్వయంభూ లింగం ఉందని తెలిసింది. అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించాడు.  పూజ అయినా తరువాత ఒక దివ్య విమానం నిర్మించి, తన దేవలో కానికి తిరిగి వెళ్ళిపోయాడు.

ఇంకో విషయం ఏమిటంటే, ధనంజయన్ అనే వ్యాపారి ఆ దారిలో చేస్తూ రాత్రి పడేసరికి ఆ ఆలయం  విశ్రాంతికోసం ఆగాడు. ఆలయంలోపల దేవపూజలు పూజలు జరుగుతున్నట్లు గుర్తించారు.  వెంటనే ఈ విషయం ‘మనపూర్ ‘ను పరిపాలిస్తున్న ప్రభువు కులశేఖర పాండ్యన్ కు  ఈ విషయం తెలియచేసాడు. ఆ రాజు అరణ్యానికి వచ్చి, దైవాన్ని పూజించాడు. తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మదురై నగరాన్ని తీర్చిదిద్ది, చక్కటి ఆలయాన్ని నిర్మించిన ప్రభువు ఈ కుల శేఖరుడే.

కులశేఖర పాండ్యన్ తరువాత గద్దె ఎక్కిన రాజు మలయధ్వజ పాండ్యన్. అతనికి సంతానం లేదు. అందుకని తన భార్య కాంచన వూలతో సంత తికోసం యజ్ఞం చేశాడు. యజ్ఞకుండం నించి మూడు రొమ్ములతో ఉన్న మూడేళ్ల బాలిక బయటకు రావడంతో దంపతులు షాక్ అయ్యారు. అప్పుడు ఒక దివ్య స్వరం ఆ దంపతులను  కలవరపడవద్దని చెప్పింది అలాగే ఈ అమ్మాయి తన భర్తను గుర్తించినప్పుడు మూడవ రొమ్ము అదృశ్యమవుతుంది. ఈ అమ్మాయి ‘తడాతగై’ ను, ఒక రాజకుమారుడిలా వెంచారు.

ఆమె యుద్ధ విద్యలన్నిటిలో కౌశల్యం గడించింది. తడాతగై ఈ రాజ్యనికి వారసు రాలుగా వచ్చి, ఇరుగు పొరుగు రాజ్యలనికి చేరుకున్నది. అయితే, ఆమె యుద్ధరంగంలో శివుడిని చూసినప్పుడు, ఆమె మూడవ రొమ్ము అదృశ్యమైంది, మరియు అతను తన భర్త అని ఆమె గ్రహించింది. వరమశివుడు మదురై వచ్చాడు, తడాతగైను పెళ్లిడాడు , వీరిద్దరూ కలిసి మధురై నగరాన్ని కొంతకాలం పాలించారు. తరువాత మురుగన్  అవతారమైన వారి కుమారుడు ఉగ్ర పాండ్యన్ కి  సింహాసనం అందచేసి వారు మళ్లా సుందరేశ్వరర్, మీనాక్షిగా తమ అసలు రూపాలతో అవతరించారు.

*ఆలయ చరిత్ర*

ఈ ఆలయ చరిత్ర మనల్ని పురాణ కాలానికి తీసుకెళ్తుంది, ఇది 7వ శతాబ్దపు శివాలయం,  దానికి కేవలం ఆవరణ గోడలు మాత్రమే ఉండేవి. మీనాక్షి ఆలయం 12 వ శతాబ్దంలో, దడైయవర్మన్ సుందర పాండ్యన్ పరిపాలనలో నిర్మించబడింది.  9 అంతస్తుల గోవరాలు 13వ మరియు 16వ శతాబ్దాల మధ్య సృష్టించబడ్డాయి.  200 సంవత్సరాల నాయక్కర్ ల పాలనలో, వివిధ మండపాలు, వేయి స్తంభాల మండపం, అష్టశక్తి మండపం, పుదు మండపం,  వండియూర్ తెప్పకుళమ్, నాయక్కర్ మహల్ వంటి దివ్యమైన కట్టడాలు ఎన్నో నిర్మించబడ్డాయి.

ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయ సముదాయం చాలా వరకు 12వ మరియు 18వ శతాబ్దాలలో నిర్మించబడింది. 1877లో పట్టణవాసులు – ముఖ్యంగా వైనగరం కుటుంబం పెద్ద ఎత్తున పునరుద్ధరణ చేపట్టారు. ఈ పునరుద్ధరణ కాలంలోనే కంబత్తడి మండపంలో అనేక కొత్త శిల్పాలు నిర్మించబడ్డాయి. అసంపూర్తిగా ఉన్న ఉత్తర గోపురం పనులు పూర్తయ్యాయి.

1960-63లో శ్రీ పి. టి రాజన్ ఆధ్వర్యంలో ఆలయ పూర్తి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. గోపుర అలంకార శిల్పాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. సంప్రదాయ రంగులతో మళ్లీ పూత వేయబడింది. ఆలయాల్లోని పాడుపడిన చిత్రాలన్నింటికీ మళ్లీ రంగులు వేయించారు. స్వామి ఆలయం లోపలి గోడలు, తిరువిళైయాడల్ పురాణ ‘సంబంధమైన ఘట్టాలు కొత్తగా చిత్రించారు. ఈ గొప్ప పునరుద్ధరణ కార్యనికి చిహ్నంగా ఆధునిక ఉపకరణాలతో మండవం నిర్మించారు.

ఇక్కడ కొలువై ఉన్న దేవతలు సుందర్వా స్వామి, మీనాక్షి అమ్మవారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం  మొదటగ   మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి.  అమ్మవారి దర్శనానికి తూర్పువైపున ఉన్న అష్టలక్ష్మీ మండపం  ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలి.

మీనాక్షి ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల కలులతో ఒక పెద్దకోటలాంటి ఆవరణలో ఉంది. బయట ఉన్న ప్రాకారానికి నాలుగువైపులా తెలుగు ఎత్తయిన గాలిగోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజు చేత నిర్మించబడ్డాయి. ఈ నాలుగింటిలోనూ దక్షిణపు వైపు గోపురం అన్నిటికంటే ఎత్తయినది. ప్రాకారం లోపలే అమ్మవారి సన్నిధికి ఎదురుగా పెద్ద పుష్కరిణి ఉంది.

*అష్టశక్తి మండపం*

రష్ట శక్తి మండపం ప్రవేశద్వార అంతటా మీనాక్షిదేవి వరిణయ కథా ఘట్టాలు శిల్పాలలో కనిపిస్తాయి. ఇరు పక్కలా గణేశ, సుబ్రహ్మణ్య స్వాముల విగ్రహాలు, అటు ఇటు  స్తంభాల పైన  అష్టక్తుల  బొమ్మలు చెక్కి ఉండటంవల్ల మండపానికి ఈ పేరు వచ్చింది, గోడలవైన తిరువిళైయాడల్ (శివలీలలు) పురాణ ఘట్టాలు చిత్రాలలో, శిల్పాలలో కనుపండువుగా కనిపిస్తాయి. మండపానికి  తూర్పు చివరన నలుగురు శైవ మహాపురుశషుల చిత్రాలు అలంకరించబడి ఉంటుంది.

*మీనాక్షి నాయకన్ మండపం*

అష్టశక్తి మండపం దాటిన తర్వాత విశాలమైన మీనాక్షి నాయకన్ మండపం వస్తుంది. దీనిని సృష్టించిన అతని పేరు మీదనే ఇది వెలసింది. ఆరు వరుసల రాతిస్తంభాలు విడదీసిన అయిదు పక్క సోల్పులమీద యాళి రూపాలూ, ఇతర బొమ్ములూ చెక్కబడివున్నాయి. ఈ మండపాన్ని అష్టశక్తిమండవంలో కలిపే  ఒక ఆలయం  ఉన్నది. అక్కడ వేటగాడు, వేటక కై  రూపంలో శివ పార్వతుల విగ్రహాలు చూడటానికి ఎంతో అబ్బురంగా ఉంటాయి.  ఈ మండపానికి పశ్చిమాన 1008 ఇత్తడి దీపాల వరుసలతో నిండిన తిరుక్షి ఉంది.

*మదలి పిల్లె మండపం*

ఈ మదలి పిల్లె మండపంలో  అద్భుతమైన  ఒక చిత్ర గోపురం మనల్ని మదలి పిల్లె మండపంలోకి ప్రవేశించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. దీనినే చీకటి మండపం అంటారు. ఇక్కడ అసంఖ్యాకమైన శిల్పాలు ఉన్నాయి.  ఇందులో భిక్షాటనర్, ఆయన సౌందర్యంచే సమ్మోతులైన దారుకా వన బుషిపత్నులు, మోహిని మరియు  ఇతర  విగ్రహాలు అతి ప్రముఖమైనవి. ఒక్కొక్క శిల్పమూ ఒక్కొక్క గాధను వెల్లడిస్తుంది.  వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు  ఈ మండపాన్ని నిర్మించిన కడందై ముదలియార్ విగ్రహాలు కూడా చెప్పుకోదగిన కళాఖండాలుగా విరాజిల్లుతున్నాయి.

*స్వర్ణ కమల తటాకం*

చీకటి మండపం నుండి అందాలు కురిపించే పవిత్రమైన  పొట్రామరైకుళం (స్వర్ణకమల తటాకం)కు వెళతాం. స్వర్ణ కమల తాటకం గురించిన పురాణం ఏమిటంటే, దేవేంద్రుడు తన పాపాలను పోగొట్టుకోవడానికి స్వర్ణ కమల తాటకంలో స్నానం చేసి, అందులోని బంగారు కమలాలతో శివుడిని పూజించాడు. ఈ తటాకానికి చుట్టూతా విశాలమైన తాళ్వారములున్నాయి. ఉత్తర తాళ్వారం స్తంభాలమీద మూడవ తమిళసంఘం కవీశ్వరులు 24 మందివి చిత్రాలున్నాయి ఇ తాళ్వారంలోనే మరో రెండు స్తంబాలపైనా మరి  రెండు చిత్రాలున్నాయి.  కదంబ వనంలో ముఖ్య క్షేత్రాన్ని కని పెట్టిన ధనంజయంది, రెండోవాడి ఈ నగరాన్నీమరియు ఈ  ఆలయాన్ని నిర్మించిన కులశేఖర పాండ్యన్ది. ఉత్తర, తూర్పు దిశలనున్న ‘తాళ్వారాల గోడలవైన తిరువిళై యాడల్ వురాణ సంబంధమైన అనేక ఘట్టాలు చిత్రీకరింవ బడివున్నాయి. తూర్పు ద్వారం నుండి చూస్తే, మీనాక్షి సుందరేశ్వరుని గర్భగుడిపై బంగారు గోపురాలు కనిపిస్తాయి.  దక్షిణ తాళ్వారపు గోడకు తాపిన పాలరాతి ఫలకాలమీద తిరుక్కురళ్ చరణాలు చెక్కబడి ఉన్నాయి.

*ఊంజల్ మండపం*

తటాకానికి ఆనుకుని పడమర వైపు ఊంజల్ (ఉయ్యాల) మండపం ఉన్నది. ఇక్కడ ప్రతి శుక్రవారంనాడు సుందరేశ్వర, మీనాక్షి విగగ్రాలకు పూజ జరుగుతుంది. ఊంజల్ మండపం పైకప్పు ఆరు ప్రసిద్ధ మురుగదేవాలయాల (ఆరుపడైవీడు)  చిత్రాలతో చాలా అలంకరించబడి ఉంది. తటాకంలోకి అడుగుపెట్టగానే  పై వరుసలో పడమటికి అభిముఖంగా రాణిమంగమ్మ, ఆమె మంత్రి రామప్పయ్యల చిత్రపటాలు కనిపిస్తాయి.

*కిళికూట్టు మండపం*

ఊంజల్ మండపానికి పక్కనే  కిళికూట్టు మండపం ఉన్నది. పంజరాల్లో ఉంచబడిన చిలుకలవల్ల దానికి ఈ పేరు వచ్చింది. దీర్ఘమైన స్తంభాల వరుసా, సున్నితంగా చెక్కబడిన బొమ్మలూ ఆ మండపానికి ఎంతో శోభ చేకూరుసున్నవి. పంచపాండవులు, వాలి సుగ్రీవులు, ద్రౌపది వీరశిల్పాలు అత్యద్భుతంగా చెక్కబడినాయి. అమ్మవారి ఆలయానికి ఎదురుగా బ్రహ్మాండమైన రెండు వర్ణ చిత్రాలు – ఒకటి పట్టాభిషేక ఘట్టం, రెండవది మీనాక్షి దేవి వివాహవైభవ ఘట్టం ఇవి ఆ మండవ శాల సౌందర్యన్ని ఇనుమడింప చేస్తున్నాయి. కప్పువైన ఉండే దేవుళ్ల చిత్రాల వనితనం మనల్ని ఆనందాశ్చర్యాలలో ముంచి వేస్తుంది.

*మీనాక్షి కోవెల*

కిళికూట్టు మండవం దాటగానే  సరాసరి మీనాక్షిఅమ్మవారి ఆలయంలోకి మనం ప్రవేశిస్తాం. ద్వారం దగ్గరే మూడంతస్థుల గోవురం కనబడుతుంది. బయట ప్రాకారంలో మనకు అగపదేవి బంగారు ధ్వజస్తంభం, తిరుమల నాయకుని మండపం, ద్వారపాలకుల ఇత్తడి విగ్రహాలు, వినాయక కూడల్, కుమరర్ సన్నిధులు, కూడల్ కుమరర్ గుడి గోడలమీద అరుణగిరినాథర్ గానం చేసిన తిరుప్పుగళ్ గీతాలు లిఖింపబడి ఉన్నవి.

ఆరుకాల్ పీఠమ్ ద్వారాలగుండా వెళితే, మహామండవం అంటే లోపలి ప్రాకారం చేరుకోవచ్చు. ఇదే, కుమరగురుపరర్ తన మీనాక్షి అమ్మెయ్ పిళ్లైతమిల్, అనే గీతాన్ని ఆలపించిన పవిత్ర స్థలం. మహామండపంలో ఐరావత వినాయకర్, ముత్తుకుమరర్ ల సన్నిధులూ, శయ్యా మందిరమూ చూడవచ్చు. పశ్చిమాన అర్థమండపం మరియు గర్భాలయం  ఉన్నవి. చేత రామచిలుక -పూలచెండు ధరించి నిల్చుని, ఆదర వాత్సల్యాలను ప్రసరింప జేస్తున్న ఆ మీనలోచన మీనాక్షి దేవిని మనం ఆరాధిస్తాం. కరుణామయి, జగజ్జనని అయిన ఆ దేవి మనవై బరవే అపార కటాక్ష వీక్షణాలను వర్ణించటానికి వదజాలం చాలదు.

*ముక్కురుణి వినాయకర్*

మీనాక్షి దేవి సన్నిధినుంచి కిలికూట్టు మండవం మీదుగా మీదుగా తిరిగి వస్తుంటే  ఉత్తరపు చివర, దక్షిణాభిమూఖంగా వెలసిన ముక్కురుణి వినాయకర్ అక్కడ దర్శనమిస్తాడు. ఎనిమిది అడుగుల ఎత్తుగల ఈ వినాయకర్ మహా విగ్రహం తిరుమల నాయకుడు వండియూర్ తెప్పకుళమ్ తవ్వేటప్పుడు దొరికింది. జ్ఞాన సంబంధర్, మూడవ తమిళ సంగపు బయటి ప్రాకారంలో ప్రతిష్టించారు. ఈ క్షేత్రానికి ఎదురుగా ప్రసిద్ధి చెందిన కంబత్తడి మండపం ఉంది.

*కంబత్తడి మండపం*

చూనే వారి మనస్సును చూరగొనేటటువంటి సౌందర్యాతి శయంతో, పనితనంలో సాటిదేవి రమణీయమైన మనోహర శిల్పాలతో నిండా రివున్నది కంబత్తడి మండవం. బంగారు ధ్వజస్తంభం, నందీశ్వ రుడు, బలిపీర్, నడుముని అమరివున్నాయి. అలంకృతమైన ఎనిమిది మండప స్తంభాలూ పరమశిమని వివిధ రూపాలను ప్రదర్శిస్తాయి. విష్ణువు యొక్క అవతారాలను వర్ణించే అనేక చిత్రాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో మీనాక్షి దేవి కల్యాణ వైభవం ఉత్తమమైనది. ఇది ద్రవిడ చిత్రలేఖనం యొక్క గొప్పతనాన్ని ఏర్పరుచుకునే మహత్తర తార్కానాగా సృష్టించబడింది. ఇందులో రాయికి ప్రాణం పోసిన శిల్పి చాతుర్యం మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. మండపం దగ్గర తాండవ భంగిమలో అగ్ని వీరభద్ర, అఘోర వీరభద్ర, కాళి మరియు ఊర్ధ్వ విగ్రహాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన శిల్పాలు మనల్ని ఊహల ప్రయాణంలో తీసుకెళ్తాయి. ప్రత్యేకించి ఈ మండపం మనల్ని విస్మయానికి గురిచేసే గొప్పశిల్ప ప్రదర్శనశాలగా, మనల్ని ఆశ్చర్యసాగరంలో ముంచెత్తుతుంది.

*సుందరేశ్వరర్ సన్నిథి*

ఆలయానికి 12 అడుగుల ఎత్తున్న ద్వారపాలకులు కాపలాగా ఉంటారు. మొదటి ప్రాకారంలో ఆరు కాల్ పీఠం (ఆరు స్తంభాలుగల పీఠం) కనిపిస్తుంది.తిరువిళయాదళ్ పురాణం వెలికితీసిన పవిత్ర స్థలం ఇది. ఇత్తడి తొడుగులతో కూడిన ఇద్దరు ద్వారపాలకుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి.  ఈ ప్రాకారంలో వెలసిన సన్నిధులు సరస్వతీ దేవి, 63 నాయన్మార్ లు, ఉత్సవమూర్తి, కాశీవిశ్వనాథర్, భిక్షాటనర్, సిద్ధర్, దుర్గ, ప్రాకారవు  ఉత్తర ద్వారంలోని పవిత్రమైన కదంబ వృక్షం, కనక సభ, యాగశాల, వన్నీ వృక్షం ప్రక్కన ఒక బావి ఇవి మనకు కనిపిస్తాయి.

తదుపరి ప్రాకారంలో నటరాజస్వామి దేవాలయం. దీని కేవెళ్లియంబళం అని పేరు. ఇక్కడ కుడికాలు వైకెత్తి తాండవ నృత్యం చేస్తున్న భంగిమలో స్వామిని ఆరాధిస్తాం. సుందరేశ్వరాలయం ఉన్న ఆవరణకు వస్తాం. ఈ ఆపరణకు రక్షణ అరవైనాలుగు భూతగణాలు, ఎనిమిది ఏనుగులు, ముప్పై  రెండు సింహాలున్ను. చొక్కనాథర్, కర్పూర చొక్కర్, ఇంకా మరెన్నో వేర్లతో పిలువబడే ఆ లింగాన్ని ఆ లింగాన్ని చూసినప్పుడు మనం పుణ్యాత్ములం అవుతాము.

*వెయ్యి స్తంభాల మండపం*

స్వామివారి సన్నిధి నుంచి కంబత్తడి మండపం మీదుగా వేయి స్తంభాల మండపానికి చేరుకుంటారు. ఈ చిత్ర కళాఖండాన్ని సృష్టిం చిన అశ్వారూఢుడైన అరియనాథ ముదలియార్ శిలావిగ్రహం గుమ్మంవద్ద మనల్ని ఆహ్వానిస్తూ వుంటుంది. దానికి ఇరువైపులా కన్నప్పర్, భిక్షతానార్, చంద్రమతి, కురవన్ మరియు కురట్ విగ్రహాలు ఉన్నాయి. లోపలికి ప్రవేశించేటప్పుడు మనల్లిని ఆకర్షించేది పైకప్పుపై ఉన్న చెక్కబడిన చక్రం. అది అరవై తమిళ సంవత్సరాలనూ సూచిస్తుంది. ముండ పంలో ఉన్నవి 985 స్తంభాలు. వారి అమరికలోని చిత్రం ఏమిటంటే – ఏ కోణం నుండి చూసినా, అవన్నీ ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే విగ్రహాలు: మన్మథుడు -రతీ దేవి, అర్జునుడు, మోహిని, కలిపురుషుడు, వీణ చేతపట్టిన వడతి, చివరగా ఒక మండపంలో అందాలను కురిపించే నటరాజ విగ్రహాన్ని చూడవచ్చు. పురాతన కళాఖండాలు, అరుదైన విగ్రహాలు, కదిలే చిత్ర కళాఖండాలు, చూడముచ్చటగా ప్రదర్శించబడుతున్నాయి. ఇవి చూడని కళ్ళు, కానీ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం విలువైనది మరియు అర్థవంతమైనది.

*మంగయర్ కరసి మండపం*

వేయి స్తంభాల మండపానికి దక్షిణంగా కొత్తగా నిర్మించిన మంగయార్ కరసి  మండపం ఉంది. ఇక్కడ కూన్-పాండ్యన్, మంగయర్ కరసి, జ్ఞానసంబందర్ ల శిలావిగ్రహాలూ, ఒక లింగమూ ఉన్నవి. దక్షిణ దిశను మరుదు పాండ్యులు నిర్మించిన నేర్వైకారర్ మండవం ఉన్నది. దగ్గరనే తిరుకల్యాణ మండపం. దీని పైకప్పు మంచి కర్ర పనితనానికి గొప్ప నిదర్శనంగా రూపొంది వున్నది.

 *గోపురాలు*

గుడు అన్నిటినీ పరివేష్టించివున్న వీధిపేరు ఆడివీధి. ఈ వీధిని తోమ్మిదేసి అంతస్థులుగల బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు నలుదిశలా అలంకరించి వున్నాయి. 160 అడుగుల ఎత్తు, ప్రక్కల అలంకారికమైన వంపులతో నిర్మింపబడిన దక్షిణ గోపురం అన్నింటికన్న ఎత్తయినది. దీనిని 16వ శతాబ్దంలో శెవ్వండి చెట్టియార్ నిర్మించారు. ఉత్తర గోపురానికి మహోవేరు మొట్టైయ్ గోపురం. దీనికి చెప్పుకో తగిన కళా విశేషాలు ఏమీలేవు. తూర్పునవున్న అతి ప్రాచీన గోపురం 13 వ శతాబ్దిలో మారవర్మన్ సుందర పాండ్యన్ చేత నిర్మించబడింది. పశ్చిమ గోపురం 14 వ శతాబ్దంలో పరాక్రమ పాండ్యన్ చేత నిర్మించబడింది.ఆలయానికి శోభను చేకూర్చే అనేక ఇతర చిన్న గోపురాలు ఉన్నాయి.

*సంగీత స్తంభాలు*

ఉత్తర గోపురం పక్కన ఐదు సంగీత స్తంభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒకే రాతితో చెక్కబడిన 22 చిన్న స్తంభాలను కలిగి ఉంటాయి, ఇవి నొక్కినప్పుడు సంగీత స్వరాలను పలుకుతాయి.

*పుదు మండపం*

తూర్పు గోపురం ముందు  వుదు (కొత్త) మండవం దీనినే వసంత మండపం అని కూడా అంటారు. తిరుమల  నాయకుని రాజ్య పాలనలో నిర్మించబడింది. ఇది మీనాక్షి సుందరేశ్వరుని వేసవి విడిది. ఉత్సవాల సందర్భంగా మండపం మధ్యలో ఉన్న నల్లరాతి పీఠంపై విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ మండపాన్ని అలంకరించే అద్భుతమైన  శిలా విగ్రహాలు ఇవి : తడాతగై, మీనాక్షీ దేవి కల్యాణం, రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడం, చెరకుగడతింటున్న రాతి ఏనుగు. ఇక్కడ స్థాపితమైన నాయకర్ ప్రభువుల విగ్రహాలు వారిని చిరస్థాయిగా నిలిపాయని చెప్పవచ్చు. వుదు మండవం నుండి బయటకు వస్తుంటే, అసంపూర్తిగా ఉన్న రాయగోపురం మన దృష్టిని ఆకర్షిస్తుంది. పునాదుల విస్తీర్ణం చూస్తే కట్టడం పూర్తయినప్పుడు ఇది భారత దేశం మొత్తానికే బ్రహ్మాండమైన గోపురంలా అనిపించవచ్చు.

*వండియూర్ తెప్పకుళమ్*

పట్టణానికి బయట నిర్మింపబడి వున్నది – దివ్యమైన వండియూర్ తెప్పకుళమ్ – దీనికే మరోపేరు మారియమ్మ తెప్పకుళం. పొడవు 1000 అడుగులు, వెడల్పు 950 అడుగులు. తటాకం నడుమ ద్వీపంలో ఒక. సుందర మండవం దానిచుట్టూ నాలుగు చిన్న మండపాలు. పవిత్ర తైపూసం రోజున జరిగే తెప్పోత్సవం జీవితంలో మరిచిపోలేని ఘట్టం

*అళగర్ కోయిల్*

మధురై నగరానికి తూర్పున పన్నెండు మైళ్ల దూరంలో ఆహ్లాదకరమైన పర్వతంపై అందమైన విష్ణు దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతిష్ఠింపబడిన స్వామి సుందరరాజన్. రోజూ ఆ కంచు విగ్రహానికి అభిషేకించే జలం కొండ పైన రెండు మైళ్ల దూరంలో ఉన్న ఒక ఊటలోనించి వస్తుంది. ఇందుకు ఈ జలమే కాని వనికిరాదు. మరేదైనా నీటిని ఉపయోగించి విగ్రహం నల్లగా మారుతుంది.  చిత్ర పూర్ణిమనాడు, అళగర్ విగ్రహాన్ని ఊరేగింపుగా వైగై నదికి తీసుకువెళతారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆనందిస్తారు.

*తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయం*

తిరుప్పరంకుండ్రంమదురై పట్టణానికి ఆరు మైళ్ల దూరములో వున్నది. తిరుప్పరంకుండ్రం ప్రసిద్ధమైన ఆరు మురుగన్ ఆలయాలలో  ఇది ఒకటి. ఇది ఒక గుహాలయం. శూరపద్ముని సంహరించిన తరువాత ఇంద్రుడి కుమార్తె దేవయానిని వివాహం చేసుకున్న ప్రదేశం ఇది. ఈ ఆలయం లోపల  శివుడు, గణపతి, దుర్గ, విష్ణు, మరి ఇతర దేవతలకూ వేర్వేరు సన్నిధులు ఉన్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర చిత్ర విచిత్రమైన చెక్కడములతో 48 స్తంభాలు ఉన్నాయి.

*ఉత్సవాలు*

మధురై ఉత్సవాల పట్టణం. ఉత్సవ సమయాలలో దేవాలయ అర్చకులు వరమశివుని వివిధ లీలల (తిరువిళైయాడల్)ను ఎంతో ఆసక్తిగా ప్రదర్శిస్తారు. సంవత్సరం పొడుగునా ప్రతి నెల నెలా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే వుంటుంది. ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ మీనాక్షి తిరుకళ్యణం. ఇది ఏటా ఏప్రిల్‌లో జరుగుతుంది.తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో (ఏప్రిల్-మే) నెలలో మీనాక్షి మరియు సుందరే శ్వరుల కళ్యాణం జరుగుతుంది. చైత్ర పూర్ణిమ నుండి స్వామికి జరిగే వివాహ వేడుకల్లో నిజంగానే ఓ బాలునికి – ఓ బాలికకు పెళ్లి అలంకరణ చేసి కల్యాణ మహోత్సవానికీ, వైగైనది అళగర్ ఊరేగింపుకీ, దేశం నలు మూలలనుంచీ వచ్చే అశేష జనసముద్రానికి అంతులేదు. ఈ కళ్యాణం చూడడానికి అనేకమంది భక్తులు తండోపతండాలుగా వస్తారు. మరి కళ్యాణం చూడడానికి మీరు కూడా వెళ్తారు కదా..

Show More
Back to top button