భారత్ కు స్వాతంత్ర్యం అందించడమే లక్ష్యంగా తన ప్రాణాల్ని సైతం ఆపదలో పెట్టి ఏళ్లకెళ్లు బంధిగానే గడిపిన మహనీయుడు. తొలుత లండన్ లో విప్లవోద్యమానికి తెర లేపి, ఆపై అండమాన్ లో దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపారు. భారతీయుల్లోహిందుత్వాన్ని నేర్పి, జాతి సమైక్యతకు కార్యరూపం దాల్చారు. ఫలితంగా హిందూ మహాసభకు అధ్యక్షులయ్యారు.ఏటా విశేషంగా జరుపుకునే గణేష్, శివాజీ ఉత్సవాలను తీసుకొచ్చింది ఆయనే..ఎన్నో గ్రంథాల్ని రాసి, మనకు అందించారు.. వీటిల్లో అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు కీలకంగా కనిపిస్తాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో ఒకరైన సావర్కర్.. మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా.స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. అటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి నేడు(మే 28న). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు స్వాతంత్ర్యం కోసంఆయన చేసిన కృషి గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం: బాల్యం, విద్యాభ్యాసం… 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక దామోదర్ సావర్కర్. అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీరిచిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బ్రిటిష్ ఆగడాలకు భారతీయులు పడరాని పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నదీనమైన రోజులవి.ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లు తమ కులదైవం సాక్షిగా దేశ స్వాతంత్య్రం కోసం తమప్రాణాలను సైతం అర్పించేందుకు సంసిద్ధులని ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం అభినవ భారత్ వంటిసంస్థల్ని స్థాపించారు. విద్యాభ్యాసం నాసిక్ లో జరుగగా, బీ.ఏ, పూణెలోని పెర్గ్యూసన్ కళాశాలలో పూర్తి చేశారు. బార్-ఎట్-లా చదువు కోసం 1906లోలండన్ వెళ్లారు. అప్పటికే సావర్కర్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడు. విప్లవం మొదలైంది.. తెల్లోళ్ళ గడ్దపైనే… తెల్లవాళ్ల గడ్డ అయిన లండన్ నుంచే తన విప్లవాన్ని నడిపించాలని నిర్ణయించుకున్న సావర్కర్ కు లా చదువు ఒక సాకుమాత్రమే…అక్కడి విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి నడిచారు. న్యాయవిద్య పూర్తి చేసుకున్నప్పటికీ, పట్టా అందుకోలేదు. కారణం అప్పటి బ్రిటిష్ రాణి పట్ల సావర్కర్ కనీస విధేయతప్రదర్శించకపోవడమే… అంతేకాకుండా మరో సందర్భంలో బ్రిటిష్ ఆర్మీ అధికారిని హతమార్చిన కారణంగా వినాయక్ దామోదర్సావర్కర్ మీద, అతని కుటుంబం చర్యల మీద నిఘా పెరిగింది. ఎలాగోలా నిర్బంధించిన సావర్కర్ ను స్టీమర్ లో భారత్ కుతీసుకొస్తున్న సమయంలో, తప్పించుకునేందుకు యత్నించినా విఫలమయ్యాడు. 1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు…
Read More »బ్రహ్మ సమాజాన్ని విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మర్షిగా, అత్యుత్తమ అధ్యాపకుడిగా, వక్తగా.. ఆంధ్రదేశసమాజ ఉద్దరణయే ధ్యేయంగా… అంటరానితనాన్ని రూపుమాపి, దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి సలిపారు. ప్రబలంగా వ్యాప్తిలో…
Read More »ఐపీఎస్ అవ్వాల ఆశ ఉన్నా.. ఎటువంటి శిక్షణ తీసుకోకుండా.. నేరుగా సినిమాల్లో అడుగుపెట్టిన నటుడు.. తొలి చిత్రంతోనే హీరోగా హిట్ అందుకున్నాడు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో…
Read More »భారతదేశానికి రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలోనూ మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా.. ఇలా వివిధ పదవులను అధిరోహించి,…
Read More »“శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాజనేయం! ప్రభాదివ్య కాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహం, భజేహం, భజేహం!” అంటూ భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు.…
Read More »గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుని జననం జరిగింది.. అంతేకాక బుద్ధుడు బోధిచెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందింది కూడా ఇదే రోజున కావడంతో.. ఈ…
Read More »సత్యనారాయణ స్వామిని త్రియంభు(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశ) స్వరూపంగా చెబుతారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ సత్యదేవుని కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా…
Read More »పుష్కర స్నానం అనగానే.. మనకు నదులైన.. కృష్ణా, కావేరి, తుంగభద్ర.. వంటి పన్నెండు నదీజలాలు గుర్తుకొస్తాయి. పుష్కరం అంటే, పన్నెండు.. ప్రతి పన్నెండేళ్లకోసారి వస్తుంది. ఏ నది…
Read More »కుబేరుడిని పూజించే అక్షయమైన రోజు, అక్షయం అంటే క్షయం లేనిది. జీవితంలో అన్నిటినీ అక్షయం చేసేదని అర్థం.. ఈరోజున బంగారం, స్థలం, పొలాలు వంటి విలువైన వాటిని…
Read More »వీరేశలింగంగారు గొప్ప సంఘసంస్కర్తే కాదు, గొప్ప కవి, రచయిత, ఉపాధ్యాయుడు… తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన రచనలు, కవిత్వాల్లో……
Read More »