Telugu Opinion Specials

ఇండియా కూటమి ముక్కలైనట్లేనా.?

కేంద్రంలో ఉన్నఇండియా కూటమి మూడునాళ్ల ముచ్చటే అన్నట్లుగా ఉందని కనిపిస్తోంది. విభిన్న సిద్ధాంతాలు, అభిప్రాయాలు గల దాదాపు 24 పార్టీలు ఒకేతాటిపై ఉండడమే అరుదు. JDU నేత నితీశ్ కుమార్ సూచనతో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కూటమి ఏర్పడింది. అనూహ్యంగా కాంగ్రెస్ కూటమిలో పెద్దన్నపాత్ర వహించాల్సి వచ్చింది. దీంతో కూటమి కన్వీనర్‌గా నితీశ్ కుమార్‌ను ఎన్నుకోవాలన్న భావన అదిలోనే దెబ్బతింది. లేడీ సింగంగా పేరుపొందిన మమతా బెనర్జీ మొదటినుంచి ఇండియా కూటమిపట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడమే కాగ కాంగ్రెస్ పెత్తనం ఆమెకు అసలే ఇష్టం లేనట్లు కనిపిస్తాది.

అంతేకాదు బెంగాల్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అయినా ఒంటరిపోరే తమ సిద్ధాంతంగా ఎంచుకున్నారు. కాంగ్రెస్‌కు కనీసం రెండు పార్లమెంటు స్థానాలు కూడా ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఇక ఆమ్‌ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పరిస్థితి మరోలా ఉంది. ఇష్టం లేకుండానే కూటమిలో చేరినట్లు కన్పించారు. లోక్‌సభ ఎన్నికల నాటికి ఢిల్లీలో పొత్తు.. పంజాబ్‌లో లేదు అన్నట్లు వ్యవహరించారు. మరోపక్క సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ తీరు మరోలా ఉంది. కాంగ్రెస్‌తో ఉన్నట్లే ఉన్నా.. ఎప్పటికప్పుడు ఆ పార్టీకి చెక్ పెట్టే ఆలోనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఇక మరోపక్క MPలో కనీసం స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సహకరించకపోవడంతో పూర్తిగా దూరమయ్యారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమితో ఆ పార్టీపై ప్రతిపక్షాలలో ముఖ్యంగా కూటమి పార్టీలలో పూర్తిగా నమ్మకంపోయినట్లు అయింది. అంతేకాదు జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసినా, మహబూబా ముఫ్తీ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. వయో భారం, అనారోగ్యం కారణంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అంత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం లేదు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఇండియా కూటమి పూర్తిగా రద్దయి పోయినట్లయింది. 

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు టర్మ్‌లుగా అధికారంలో ఉంటోంది. పదేళ్లుగా కాంగ్రెస్ ఒక అసెంబ్లీ స్థానం కూడా గెలవలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీకి డైరెక్ట్ ఫైట్‌గా కన్పిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలంటే ఆమ్‌ఆద్మీ పార్టీకి కూటమిలో పార్టీలు నిర్ణయించాయి.

దీంతో సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జేడీ, శివసేన ఉద్ధవ్ పార్టీ ఆమ్‌ఆద్మీ పార్టీకే మద్దతుగా నిలిచాయి. దీంతో కాంగ్రెస్ ఏకాకి అయింది. ఆ పార్టీకి ఆఖరుకు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దూరమైంది. దీనిని బట్టి అర్థం అవుతుంది ఇండియా కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే అని. దీనివల్ల కాంగ్రెస్ నష్టం లేదు అని పలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show More
Back to top button